ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తిరుమల శ్రీవారి నాదనీరాజనానికి ఉపరాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి వెంకయ్య... తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నిర్వహించిన నాదనీరాజనం కార్యక్రమాన్ని తిలకించారు. ప్రముఖ కళాకారులు ఆలపించిన భాగవతార్, నామసంకీర్తన, గాత్ర కచేరీలను ఆలకించారు.

By

Published : Jun 4, 2019, 11:46 PM IST

శ్రీవారి నాదనీరాజనం కార్యక్రమాన్ని తిలకించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

శ్రీవారి నాదనీరాజనం కార్యక్రమాన్ని తిలకించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు... మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వెంగమాంబ అన్నప్రసాదం తీసుకున్నారు. సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నిర్వహించిన నాదనీరాజనం కార్యక్రమాన్ని తిలకించారు. వేదికపై ప్రముఖ కళాకారులు నిర్వహించిన భాగవతార్, నామసంకీర్తన, గాత్ర కచేరీలను వెంకయ్య ఆలకించారు.

ABOUT THE AUTHOR

...view details