ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నూతన బస్సులను ప్రారంభించిన సభాపతి సీతారాం

నూతన ఆర్టీసీ బస్సులను సభాపతి తమ్మినేని సీతారాం ఇవాళ శ్రీకాకుళంలో ప్రారంభించారు. కొంతసేపు తానే స్వయంగా బస్సు నడిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు ప్రభుత్వం విలీనం నిర్ణయాన్ని అధ్యయనం చేస్తోందన్నారు.

By

Published : Jun 29, 2019, 7:10 PM IST

నూతన బస్సులను ప్రారంభించిన సభాపతి సీతారాం

నూతన బస్సులను ప్రారంభించిన సభాపతి సీతారాం
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సభాపతి తమ్మినేని సీతారాం నూతన బస్సులను ప్రారంభించారు. అల్ట్రా తెలుగు వెలుగు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన సభాపతి...తానే స్వయంగా బస్సు నడిపారు. ఆర్టీసీ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం సేవలు అందిస్తోందని స్పీకర్ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే కార్మికుల డిమాండ్​ను అధ్యయనం చేయడానికి సీఎం జగన్ నిపుణుల కమిటీ వేశారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details