ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎవరేంటో... మే 23న తెలుస్తుంది: ఎమ్మెల్సీ డొక్కా

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వైకాపా... తమకేం తెలియదంటూ ఈవీఎంల భద్రతపై గవర్నర్​కు ఫిర్యాదు చేయడం జగన్ ఆడుతున్న ఓ కపట నాటకమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. గవర్నర్‌కు జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.

By

Published : Apr 16, 2019, 6:00 PM IST

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

రాష్ట్రంలో తెదేపా నేతలపై జరిగే దాడులు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. కేంద్రం, ఈసీ, జగన్​ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. జగన్, విజయసాయిరెడ్డి... ఈసీని పొగిడేందుకు పోటీ పడుతున్నారని డొక్కా అన్నారు. ఈవీఎంలు పని చేయకుండా మొరాయిస్తే.. ప్రజలు పడ్డ ఇబ్బందులు వైకాపాకు కన్పించలేదా అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష వైకాపా చేసే ఫిర్యాదులకు మాత్రమే ఎన్నికల సంఘం స్పందిస్తుంది తప్పా తెదేపా ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్నారు. ఈసీ పక్షపాత ధోరణికి ఇదే నిదర్శనమన్నారు. తెదేపా ఈవీఎం నిపుణులు హరిప్రసాద్​పై ఉన్న కేసుకు అభ్యతరం చెప్పిన ఈసీకి... వైకాపా చేస్తున్న దాడులు కన్పించడం లేదా అన్నారు.

50శాతం వీవీ ప్యాట్ స్లిపులు లెక్కించడానికి ఈసీకి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. మే 23న ఎవరు హీరో, ఎవరు విలన్ అనేది తెలిసిపోతుందన్న డొక్కా.... వీవీఫ్యాట్ స్లిపులు లెక్కించే వరకు చంద్రబాబు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :గవర్నర్ నరసింహన్​తో వైఎస్ జగన్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details