ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అభివృద్ధి కొనసాగాలంటే బాబే రావాలి: కొణతాల

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం దిల్లీ పెద్దలతో నాడు ఎన్​టీఆర్ పోరాడిన తరహా పరిస్థితులే నేడు రాష్ట్రంలో నెలకొన్నాయని.. ఉత్తరాంధ్ర పోరాట వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖ జిల్లా హుకూంపేటలో మంత్రి శ్రావణ్‌కుమార్‌కు మద్దతుగా జరిగిన తెదేపా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

By

Published : Mar 27, 2019, 3:19 PM IST

ఉత్తరాంధ్ర పోరాట వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ

ఉత్తరాంధ్ర పోరాట వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ
విశాఖ జిల్లా హుకూంపేటలో మంత్రి శ్రావణ్‌కుమార్‌కు మద్దతుగా జరిగిన తెదేపా ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్ర పోరాట వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.తెలుగు వారి ఆత్మగౌరవం కోసం దిల్లీ పెద్దలతో నాడు ఎన్​టీఆర్ పోరాడిన తరహా పరిస్థితులే నేడు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. మోదీని ఎదురించి పోరాడుతున్న ఒకే ఒక్క నేత చంద్రబాబే అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి చంద్రబాబు నాయకత్వం తప్పనిసరి అని ఓటర్లకు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details