ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రావనాపల్లిలో అక్రమంగా మట్టి తవ్వకాలు

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా అక్రమార్కులు మట్టి తరలించుకుపోతున్నారు. రోజుకు 200 ట్రాక్టర్ల లోడు మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

By

Published : May 30, 2019, 6:30 PM IST

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు

విశాఖ జిల్లా గొలుగొండ మండలం రావనాపల్లి జలాశయం వద్ద అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్సీపట్నంకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటున్నారు. 30 ట్రాక్టర్లు, 3 జేసీబీలతో తవ్వకాలు చేపట్టి...మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ విధంగా రోజుకు 200 నుంచే 300 ట్రాకర్ల లోడు మట్టి తరలిపోతుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ తవ్వకాలుగా రుజువైతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details