ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈ నెల 8న కేరళ తీరానికి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఈనెల 8 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. 15 నాటికి తెలుగురాష్ట్రాల్లో విస్తరిస్తాయని అంచనావేసింది.

By

Published : Jun 6, 2019, 11:42 PM IST

నైరుతి ఆగమనం

8న నైరుతి ఆగమనం

నైరుతి రుతుపవనాల ఆలస్యం కావడం వల్లే... అధిక ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు కొమరిన్​ సముద్ర ప్రాంతంలో తమిళనాడుకు దక్షణ దిశగా, అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతమై ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వైకే రెడ్డి తెలిపారు. రుతుపవనాల ఆగమనం వరకు రైతులు వేచి ఉండాలని సూచించారు. ఈనెల 8న కేరళ తీరాన్ని తాకనున్నాయని, 15 నాటికి తెలుగు రాష్ట్రాలంతటా విస్తరిస్తాయంటున్న వైకేరెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details