శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 9:54 PM IST
Telangana Deputy Chief Minister Bhatti Vikramarka Visit Sri Kalahasteeswara Temple :తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దంపతులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలను అందించారు. అయితే ఈరోజు ఉదయమే తిరుమల శ్రీవారిని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. వేకువజామునే కుటంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు భట్టి తెలిపారు.