national

పుణె శివారులో ఘోర రోడ్డు ప్రమాదం - తెలంగాణకు చెందిన ఐదుగురు దుర్మరణం

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 10:21 PM IST

Telangana Citizens Died in Pune Road Accident
pune road accident case (ETV Bharat)

Five Telangana Youths Died in Pune Accident : మహారాష్ట్రలోని పుణె శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ఆరుగురు యువకులు అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వెహికల్ ప్రమాదానికి గురైంది. మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్‌, ఫిరోజ్‌ కురేషి, మజీద్‌ పటేల్‌ ఘటనా స్థలిలో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ అమర్‌ను సమీప పుణె ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వయసు ఉన్నవారేనని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details