గుంతకల్లులో ఘనంగా ఉరుసు మహోత్సవం - పోటెత్తిన భక్తులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 3:21 PM IST
Mastanaiah Urusu Festival Celebrated In Guntakal :అనంతపురం జిల్లా గుంతకల్లులో హజరత్ సయ్యద్ షా మస్తానయ్య స్వామి 389వ ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉరుసు మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులతో ఉరుసు మహోత్సవం కోలాహలంగా మారింది. భక్తులు భారీగా తరలి రావడంతో పుర వీధులు కిక్కిరిసిపోయాయి. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి గుర్రంపై ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రార్థించారు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.