D.Srinivas Passes Away : సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ (76) కన్నుమూశారు. హైదరాబాద్లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డీఎస్ మృతి చెందారు. డీఎస్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
హైదరాబాద్లోని నివాసానికి డీఎస్ భౌతికకాయం - ఆదివారం అంత్యక్రియలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 29, 2024, 10:43 AM IST
![హైదరాబాద్లోని నివాసానికి డీఎస్ భౌతికకాయం - ఆదివారం అంత్యక్రియలు Dharmapuri Srinivas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/1200-675-21823703-thumbnail-16x9-dharmapuri-srinivas.jpg)
Dharmapuri Srinivas (ETV Bharat)
పార్లమెంట్ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం భౌతిక కాయాన్ని నిజామాబాద్కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. డి.శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు సంజయ్, రెండో కుమారుడు ఎంపీ అర్వింద్.