national

మిస్ యూనివర్స్-ఇండియాకు కుప్పం యువతి- అభినందించిన సీఎం చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 9:08 PM IST

cm_congratulates_young_woman
cm_congratulates_young_woman (ETV Bharat)

CM congratulates Young Woman Qualified for Miss Universe India:మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన కుప్పం యువతి చందన జయరాంను సీఎం చంద్రబాబు అభినందించారు. కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురం గ్రామానికి చెందిన చందనా జయరాం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఇటీవల హైదరాబాద్​లో నిర్వహించిన పోటీల్లో చందన మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఆమె పాల్గోననున్నారు. కుప్పం నుంచి మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు అర్హత సాధించటంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details