రాష్ట్ర సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆనంద్ కుమార్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 5:35 PM IST
State New Central GST Audit Commissioner: రాష్ట్ర సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనర్గా 1997 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి ఆనంద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆనంద్ కుమార్ గుజరాత్లోని కచ్లో జీఎస్టీ కమిషనర్గా పనిచేస్తూ బదిలీపై విశాఖకు వచ్చారు. రాష్ట్రం, కేంద్రం జీఎస్టీ జమలు, రాయితీలు సక్రమంగా జరిగేందుకు కేంద్ర ఆదేశాలతో మరిన్ని చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. సక్రమంగా జీఎస్టీ చెల్లింపులు చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.