ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలన్న అధికారులు - మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 3:27 PM IST
A Person Suicide Attemptedin Satya Sai District : ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. కదిరి కోర్టు రోడ్డులో మున్సిపల్ అధికారులు ఆక్రమణాలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్న రాజ్బహదూర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందేనని అధికారులు స్వష్టం చేశారు. మనస్తాపానికి గురైన రాజ్ బహదూర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధిత కుటుంబసభ్యులు అధికారుల తీరు నిరసిస్తూ రోడ్డుపైకి చేరారు. రోడ్డు ఆక్రమించడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు వివరించారు. అర్థం చేసుకున్న రాజ్ బహదూర్ కుటుంబసభ్యులు స్వచ్ఛందంగా షెడ్డును తొలగించడంతో సమస్య సద్దుమణిగింది.