చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 5:11 PM IST
|Updated : Jun 10, 2024, 5:39 PM IST
![చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం Chandrababu Naidu oath ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-06-2024/1200-675-21679179-thumbnail-16x9-chandrababu.jpg)
Chandrababu Naidu oath ceremony:తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు, పార్టీ నేతలు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్ ప్రభుత్వ బాధితులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసింది. మొత్తం 112 కుటుంబాలు ఇందుకు ఎంపిక చేశారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 112 కుంటుబాలకు ఆహ్వనం పంపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ అరాచకాలకు బలైన కుటుంబాలను సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.