నేపాల్లో వరుణుడి బీభత్సం- ఒక్కరోజులో 14మంది బలి
Published : Jun 26, 2024, 10:46 PM IST
|Updated : Jun 26, 2024, 11:01 PM IST
![నేపాల్లో వరుణుడి బీభత్సం- ఒక్కరోజులో 14మంది బలి Nepal Rains 2024 Death Toll](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-06-2024/1200-675-21803130-thumbnail-16x9-nepasl.jpg)
Nepal Rains 2024 Death Toll : నేపాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల్లో గత 24 గంటల్లో 14 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు చనిపోయారు. "జూన్ 26న మొత్తం 44 ఘటనలు జరిగినట్లు గుర్తించాం. మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి గాయాలయ్యాయి. గత 17 రోజుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 147 ఘటనలు జరిగాయి." అని NDRMA అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.