national

లోయలో పడ్డ బస్సు- 21మంది మృతి, 30మందికి గాయాలు

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 4:18 PM IST

Updated : May 30, 2024, 5:22 PM IST

Road Accident In Jammu Today
Road Accident In Jammu Today (Source : ETV Bharat)

Jammu Road Accident Today :జమ్ముకశ్మీర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. జమ్ము- పూంఛ్ జాతీయ రహదారిపై నుంచి ఓ బస్సు లోయలో పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో సహాయక బృందాలు చేర్పించాయి. బస్సులో 80 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

Last Updated : May 30, 2024, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details