లోయలో పడ్డ బస్సు- 21మంది మృతి, 30మందికి గాయాలు
Published : May 30, 2024, 4:18 PM IST
|Updated : May 30, 2024, 5:22 PM IST
![లోయలో పడ్డ బస్సు- 21మంది మృతి, 30మందికి గాయాలు Road Accident In Jammu Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-05-2024/1200-675-21594973-thumbnail-16x9-bus-accident.jpeg)
Jammu Road Accident Today :జమ్ముకశ్మీర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. జమ్ము- పూంఛ్ జాతీయ రహదారిపై నుంచి ఓ బస్సు లోయలో పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో సహాయక బృందాలు చేర్పించాయి. బస్సులో 80 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.