national

ETV Bharat / snippets

నాటు సారాకు 53మంది బలి- ఇంకా వెంటిలేటర్​పై అనేక మంది- 250 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 1:00 PM IST

Tamil Nadu Liquor Death Toll
Tamil Nadu Liquor Death Toll (ETV bharat)

Tamil Nadu Liquor Death Toll: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 53కు పెరిగిందని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఎమ్​ఎస్ ప్రశాంత్ తెలిపారు. 193 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ, వారిలో 140 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. కల్తీసారా ఘటనలో ఇప్పటికే పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. 250 లీటర్లకు పైగా కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తమిళనాడు సీబీ-సీఐడీ శాఖకు అప్పగించారు. ఈ ఘటనలో మరణించినవారి పిల్లల చదువులకు సంబంధించిన మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్టాలిన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details