ఆస్పత్రి నుంచి ఎల్కే అడ్వాణీ డిశ్చార్జ్
Published : Jun 27, 2024, 2:51 PM IST
Advani Health Update Today :భారతీయ జనతా పార్టీ అగ్ర నేత ఎల్ కే అడ్వాణీ(96) దిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపాయి. దీంతో గురువారం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నాయి. వయో సంబంధిత సమస్యలతో అడ్వాణీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పాయి. అన్ని పరీక్షల అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపాయి. ఆదివారం రాత్రి అడ్వాణీ అస్వస్థతకు గురవ్వగా, చికిత్స కోసం ఎయిమ్స్లో ఆయన కుటుంబసభ్యులు చేర్పించారు.