ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వాసుపత్రుల వ్యవస్థ నిర్వీర్యమైంది : మంత్రి నిమ్మల - Nimmala on Government Hospitals

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 6:56 PM IST

Nimmala RamaNaidu on Government Hospitals System (ETV Bharat)

Nimmala RamaNaidu on Government Hospitals System : వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలో వంద పడకల స్థాయికి పెరిగిన ఆసుపత్రికి సంబంధించి 12 కోట్ల రూపాయలతో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను పలకరించారు. వైద్య సేవలు గురించి ఆరా తీశారు. 

జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది : అనంతరం నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ..  నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వంద పడకల ప్రాజెక్టును 2019లో ప్రభుత్వం మారడంతో నిర్వీర్యం అయ్యిందని అన్నారు. జగన్ సర్కార్ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details