ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పాత కక్షలతో దాడి - వ్యక్తికి తీవ్ర గాయాలు - TENSION IN PENUGANCHIPROLU - TENSION IN PENUGANCHIPROLU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 3:09 PM IST

Attack on Man in Penuganchiprolu : ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యక్తిపై దాడి జరిగింది. నవాబుపేటకు చెందిన గింజుపల్లి శ్రీనివాసరావు కారును ధ్వంసం చేసిన ప్రత్యర్థులు ఆ తర్వాత ఆయనపైనా కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన శ్రీనివాసరావును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గింజుపల్లి శ్రీనివాసరావుపై దాడితో నవాబుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చింత వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మరికొందరితో కలిసి గింజుపల్లి శ్రీనివాసరావుపై దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

అరెస్టు చేయాలని డిమాండ్ : నవాబుపేటలో రహదారిపై వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు. శ్రీనివాసరావుపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2009లో శ్రీనివాసరావు తండ్రి అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత గింజుపల్లి వీరయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య కేసులో నిందితులే ప్రస్తుతం శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details