దంపతులపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి- దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Unknown Attacked The Couple - UNKNOWN ATTACKED THE COUPLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 1:05 PM IST
Unknown Assailant Attacked The Couple In Nellore District : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దంపతులపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేశాడు. ఆత్మకూరు బీఎస్ఎన్ఎల్ (BSNL) కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. వాసిలి నుంచి బట్టేపాడుకు బైక్పై వెళ్తుండగా దాడి జరిగిందని బాధితులు తెలిపారు. బాధితుడిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్, సుశీల దంపతులు బట్టేపాడు గ్రామంలో నివాసముంటున్నారు. వారిద్దరు వాసిలి నుంచి వస్తూ ఆత్మకూరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర ఓ దుకాణంలో కూల్ డ్రింక్ తాగారు. అనంతరం బట్టేపాడుకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు.
అడ్డుకున్న భార్య సుశీలపైనా దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అసలు దాడి పాల్పడినవారెవరు? కారణాలు ఎంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.