LIVE: వరద నష్టంపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్, చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Shivraj Singh Chouhan Press Meet
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 7:42 PM IST
|Updated : Sep 5, 2024, 7:59 PM IST
shivraj_singh_chouhan_press_meet (ETV Bharat)
Union Minister Shivraj Singh Chouhan Press Meet Live: రాష్ట్రంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి వరద పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజీ వద్ద కొనసాగుతోన్న గేట్ల మరమ్మతు పనులనూ పరిశీలించారు. బ్యారేజీ మరమ్మతు పనులు చేస్తోన్న వైనాన్ని తెలుసుకున్నారు. భారీ వర్షాల వల్ల ఇటీవల బ్యారేజికి అత్యధికంగా రికార్డు స్థాయిలో వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11.46 లక్షల క్యూసెక్కుల పైగా వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. వరద ఉద్దృతి వల్ల ఎగువ నుంచి 4 భారీ పడవలు కొట్టుకొచ్చి బ్యారేజిని ఢీకొట్టినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. రెండు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్ లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. భారీవరద రావడంతో బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో అపారంగా ఇళ్లు, పొలాలు నీట మునిగాయి తెలిపారు. ఈ క్రమంలో వరదతో ముంపునకు గురైన ప్రాంతాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా చౌహాన్కి సీఎం చంద్రబాబు వివరించారు. ప్రత్యక్షప్రసారం.
Last Updated : Sep 5, 2024, 7:59 PM IST