By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
"వాహ్ తీజ్" - గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో కోలాహలంగా వేడుక - Teej Celebration in Anantapur
Teej Celebration in Anantapur District : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపానాయక్ తాండ (RUPA NAIK TANDA) లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న గిరిజన మహిళలు ఆడిపాడారు, సంప్రదాయ నృత్యాలు చేశారు. 11 రోజుల పాటు జరిగిన ఈ తీజ్ ఉత్సవాల్లో గురువారం చివరి రోజు కావడంతో గురునానక్, తుల్జాభవాని ఆలయాల్లో పూజలు చేశారు. వెదురు బుట్టల్లో ఉన్న తీజ్ మొక్కలను తొలగించి కుల పెద్దల ఎర్ర తలపాగలో గోధుమ మొక్కలను ఉంచారు. తర్వాత బుట్టలను నెత్తిన పెట్టుకుని గ్రామ సమీపంలో ఉన్న భావిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు కేశవ్ నాయక్ , దాసు నాయక్, తులసీ దాస్ నాయక్, కమల్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. వేడుకగా జరిగిన ఈ పండుగలో తాండ వాసులంతా వారి సంప్రదాయ దుస్తులు ధరించారు. తీజ్ (Teej Celebration) జరుపుతున్న ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.