ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: సిద్ధం సభ ఓ మయసభ- టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - TDP Leader Varla Ramaiah Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 12:09 PM IST

Updated : Mar 11, 2024, 12:26 PM IST

TDP Leader Varla Ramaiah Press Meet Live: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వంటి జాతీయ స్థాయి నాయకులు పాల్గొనే సభలకూ ఇంత ఖర్చు చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. వైసీపీ వంటి ఒక ప్రాంతీయ పార్టీ కేవలం నాలుగు సభలకే వందల కోట్లు ఖర్చు చేసిందంటే ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది? జగన్‌ సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల మాత్రమే కాదు ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు వేస్తున్న ప్రశ్న అదే. ఈ అయిదేళ్లలో ప్రభుత్వ పెద్దలు దోచుకున్న వేల కోట్లను ఇప్పుడు ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆ సభలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.భారీ సెట్టింగ్‌లు, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ల పేరుతో అత్యంత ఆడంబరంగా చేస్తున్న పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల మాదిరిగానే వైసీపీ సిద్ధం సభలూ జరుగుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సీఎం జగన్, వైసీపీ నేతలు కూర్చునేందుకు భారీ వేదిక, ప్రధాన వేదికపై నుంచి ప్రజల మధ్యకు జగన్ ర్యాంప్‌ వాక్‌ చేయడానికి వీలుగా దానికి అనుసంధానంగా 'వై' ఆకారంలో మరో వేదిక, వేల సంఖ్యలో ఫ్లెక్సీలు, పోస్టర్లు, ప్రాంగణమంతా నేలపై ఆకుపచ్చ తివాచీలు, వేదిక వరకు సీఎం కారు వెళ్లే మార్గంలోనూ కార్పెట్లు ఇలా ఎక్కడ చూసినా ఆడంబరం ఉట్టిపడేలా మేదరమెట్ల సిద్ధం సభ నిర్వహించారు. అంతకుముందు మూడు సిద్ధం సభలూ అదే స్థాయిలో జరిగాయి. కాగా సీఎం జగన్ సిద్ధం సభ ఓ మయసభ అని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Mar 11, 2024, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details