ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిన పెడతారు: నీలాయపాలెం - Vijay Kumar Allegations on YS Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 4:07 PM IST

Vijay_Kumar_on_Jagan (ETV Bharat)

TDP Leader Nilayapalem Vijay Kumar Allegations on YS Jagan: ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ తన ఆస్తులను పెంచుకొని రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలోకి నెట్టారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. అర్థికంగా అన్నీ రంగాలు నష్టాలోనే ఉన్నాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమే గెలుస్తుందని చెప్పాయని వివరించారు. అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిన పెడతారని చెప్పారు. రాష్ట్రంలో ఎంత ఆదాయం ఉంటే జగన్​ రెడ్డి అంత అప్పులు తెస్తున్నాడని విజయ్‌కుమార్‌ దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వాన్స్ ఎస్టిమేషన్ అంటూ కాకి లెక్కలు, సాక్షిలో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చూస్తే ఎక్కడా కూడా వచ్చిన కంపెనీలు, జరిగిన అభివృద్ధి, ఎక్కడా కనపడని వైనం ఉందని అన్నారు. కాకి లెక్కలతో అప్పులు చేస్తూ జగన్ సర్కార్ ప్రజలను మోసగిస్తుందని విజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఈ సారి అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని అప్పుడు జగన్ చేసిన మోసాలను బయట పెడతామని విజయ్ కుమార్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details