ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐదేళ్ల నుంచి రాష్ట్రంలోని బ్రాహ్మణులను అణగదొక్కుతున్న జగన్ : బుచ్చిరాం ప్రసాద్ - Buchi Ram Prasad Press Meet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 5:14 PM IST

Published : Apr 6, 2024, 5:14 PM IST

TDP Leader Buchi Ram Prasad Fires on YCP Government : జగన్ ఐదేళ్ల నుంచి రాష్ట్రంలోని బ్రాహ్మణులను అణగదొక్కుతున్నారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందే జగన్​కి బ్రాహ్మణులు గుర్తొస్తారని విమర్శించారు. పూజారులు, అర్చకులపై దాడులు జరిగినపుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మీడియాలో ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కనీసం ఒక్కరికైనా రుణాలిచ్చారా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నేరవేర్చారా అని జగన్​కి సూటి ప్రశ్నలు చేశారు. బ్రాహ్మణులు జగన్ మాయలో పడొద్దని కోరారు. 

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా 11 పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. దీనివల్ల దాదాపుగా రెండు లక్షల మంది బ్రహ్మాణ కుటుంబాలు బాగుపడ్డాయని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా బిడ్డ పుట్టినప్పటినుంచి చనిపోయే దాక అన్ని పథకాలు వర్తింపజేశారు. చివరికి చనిపోయాక కూడా గరుడ పథకం ద్వారా మట్టి ఖర్చులకు 10వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కార్పొరేషన్​లను పూర్తిగా ఎత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు. కేవలం నవరత్నాల పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బ్రాహ్మణ సంక్షేమం సాధ్యమని బుచ్చిరాంప్రసాద్‌ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details