వైసీపీ హయాంలో వ్యాపారులకు రక్షణ లేదు- ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పరామర్శించిన టీడీపీ నేతలు - TDP Dundi Serious On YCP Govt - TDP DUNDI SERIOUS ON YCP GOVT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 5:34 PM IST
TDP Dundi Rakesh Serious On YCP Govt : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యాపారులపై దాడులు, దౌర్జన్యాలు పెట్రేగిపోయాయని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కొన్ని రోజుల క్రితం దాడిలో గాయపడ్డ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణను దుండి రాకేష్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పరామర్శించారు. బాధితుని ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడి న్యాయం కోసం పోరాడతామని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐకు ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో రాకేష్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో వ్యాపారవేత్తలపై దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆరోపణలు గుప్పించారు. గోపాలకృష్ణ స్వయార్జీతమైన భూమిని వదిలి వెళ్లాలని దుండగులు గోపాలకృష్ణ పై హత్యాయత్నానికి పాల్పడినా పోలీసులు నామ మాత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గోపాలకృష్ణకు న్యాయం జరగకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.