ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మద్యం మత్తులో పులివెందుల ఎస్‌ఐ వీరంగం - విద్యుత్‌ సిబ్బందిపై దాడి - SI ATTACK ON ELECTRICITY EMPLOYEES - SI ATTACK ON ELECTRICITY EMPLOYEES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 12:36 PM IST

SI Attack With Electricity Workers in Pulivendula : వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎస్​ఐ అనిల్ కుమార్ తమపై దాడి చేశారని విద్యుత్ సిబ్బంది ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో వర్షం పడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేసి తిరిగి వస్తున్న తమను దొంగలుగా భావించి ఎస్​ఐ అనిల్ కుమార్ చితకబాదాడని విద్యుత్ సిబ్బంది గురు, షఫీ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో విద్యుత్​ సిబ్బంది అని చెప్పినా వినకుండా విచక్షణ రహితంగా కొట్టారని సిబ్బంది వాపోయారు.

ఈ దాడికి నిరసనగా విద్యుత్తు తొలగించి సమ్మె చేయాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం వేశారు. దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఎమ్మెల్సీ కోరారు. దీంతో సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధ్యుడైన ఎస్ఐ అనిల్ కుమార్​పై చర్యలకు ఉపక్రమించారు. ఎస్​ఐని వీఆర్​​కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు ఇవ్వడంతో విద్యుత్ సిబ్బంది సమ్మె విరమించుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details