ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తహసీల్దార్​ మందలింపు - సర్వేయర్​ ఆత్మహత్యాయత్నం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 7:44 PM IST

Published : Feb 13, 2024, 7:44 PM IST

Sadum Surveyor Suicide Attempt in Satyasai District : తహసీల్దార్​ మందలించారని మనస్థాపంతో సర్వేయర్​ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. తనకల్లు మండలం టి. సదుం సచివాలయం సర్వేయర్​ విజిత వాస్మోల్​ తాగి ఆత్మహత్యకు యత్నించింది. సర్వే విషయంలో తహసీల్దార్​ శోభా సువర్ణమ్మ మందలించడం వల్ల మనస్థాపానికి గురైన విజిత వాస్మోల్​ తాగింది. విజిత తల్లి ఆమెను గమనించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విధుల విషయంలో తహసీల్దార్​ మందలించడం వల్లనే తమ బిడ్డ ఆత్మహత్యాయత్నం చేసిందని విజిత తల్లి వాపోయింది. రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సర్వేయర్​ విజితకు సూచించినట్లు ఆమె తెలిపింది. విజిత చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందని తెలిపారు. ఇంతవరకు తామే బిడ్డను ఒక్క మాట కూడా అనలేదని తెలిపింది. రెవెన్యూ సిబ్బంది తనకు సహకరించలేదని సర్వేయర్​ విజితను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించినట్లు ఎమ్మార్వో శోభా సువర్ణమ్మ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details