ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం సభకు ఆర్టీసీ బస్సులు- సాధారణ ప్రయాణికులకు తీవ్ర అవస్థలు - సీఎం సభకు ఆర్టీసీ బస్సులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 3:30 PM IST

RTC Buses Allocated to CM Public Meet  Passengers Facing Problems : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో శ్రీకాకుళంలో ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 169 బస్సులను విశాఖ జిల్లా భీమిలిలో జరిగే సీఎం బహిరంగ సభకు తరలించారు. దీంతో ఉన్న బస్సులు సమయానికి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్ కు బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల కోసం ప్రయాణికులు బయటకు పరుగులు తీస్తున్నారు. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయని ఆర్టీసీ యాజమాన్యంపై  ప్రయాణికులు మండిపడ్డారు.

సీఎం జగన్  పర్యటనలు, మీటింగులు ఉంటే చాలు సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. భీమిలిలో నిర్వహించిన సభకు RTC బస్సులు మళ్లించారు. దీనివల్ల శ్రీకాకులం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి ముసలి, చిన్న పిల్లలు సైతం వేచి ఉండాల్సి వస్తుందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details