LIVE: బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ- ప్రత్యక్షప్రసారం - Ramoji Rao Samsmarana Sabha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 6:15 PM IST
|Updated : Jul 17, 2024, 8:28 PM IST
Ramoji_Rao_Samsmarana_Sabha_Live (ETV Bharat)
Ramoji Rao Samsmarana Sabha Live: బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ జరుగుతోంది. సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో ఈశ్వరి బ్రహ్మ కుమారీ మమత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. సినీ వ్యాపార రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావు ద్వారా లక్షలాది మంది ప్రేరణ పొంది ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని బ్రహ్మకుమారీస్ సభ్యులు గుర్తు చేశారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వక్తలు రామోజీ రావుతో తమకు ఉన్న అనుబంధం గురించి చర్చిస్తున్నారు. సామాన్యమైన వ్యక్తిగా మెుదలైన ఆయన ప్రయాణం మహా శక్తిగా తయారైందని కొనియాడారు. తెలుగు మీడియా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహానీయుడని కీర్తించారు. అందరూ ఆయనలా దూరదృష్టితో ఉండాలని చాలా మంది అనుకుంటారని వక్తలు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్దికి రామోజీ రావు చేసిన కృషిని భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
Last Updated : Jul 17, 2024, 8:28 PM IST