ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kurupam_YSRCP_MLA_Pushpa_Sreevani

ETV Bharat / videos

ఎన్నికల ప్రచారంలో పుష్పశ్రీవాణికి నిరసన సెగ - హామీలపై నిలదీసిన మహిళలు - Pushpa Sreevani Election Campaign - PUSHPA SREEVANI ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 1:33 PM IST

Protest to Kurupam YSRCP MLA Pushpa Sreevani : మే 13 న పోలింగ్ తేదీ కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి ప్రజల్లోకి వస్తున్నారు. కానీ వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. గతంలో ఓ సారి ఓటు అడగడానికి వచ్చారని, ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు 'అడుక్కోడానికే' వచ్చారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. 2019లో గెలిచిన తర్వాత తమ ముఖం చూసిన పాపాన పోలేదని, సమస్యల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని నిప్పులు చెరిగారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొహం చాటేస్తున్నారు వైఎస్సార్సీపీ అభ్యర్థులు.

YSRCP Candidate Pushpa Sreevani Election Campaign : ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్వతీపురం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల్లో గెలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా చెముడుగూడ గ్రామస్థులకు ఇళ్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఐదేళ్లు పూర్తి అవుతున్నా ఇచ్చినా హామీని మాత్రం పట్టించుకోలేదని పుష్ప శ్రీవాణిని స్థానిక గిరిజన మహిళ నిలదీసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వకుండానే ఎమ్మెల‌్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

ABOUT THE AUTHOR

...view details