ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బందోబస్తుకు వచ్చారు - పేక పట్టారు - వీడియో వైరల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Police Playing Cards Video Viral: ఎవరైనా జూదం ఆడితే వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పోలీసులే దారి తప్పారు. విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల కోసం వచ్చి దర్జాగా రూమ్​లో జూదం ఆడటం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు. 

దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గగుడి వద్ద బందోబస్తు డ్యూటీ కోసం వచ్చి నలుగురు సీఐలు హోటల్​లో జూదం ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తున్నాయి. వీరిలో విజయవాడ టూ టౌన్ సీఐ కొండల రావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు జూదం ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలపై పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్టు సమాచారం. జూదం ఆడుతున్న సీఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details