ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 2:59 PM IST

ETV Bharat / videos

అనంతపురంలో 144 సెక్షన్- సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల నిఘా - Police monitoring With Drone

Police Officers monitoring With Drone Cameras in Anantapur District : రాష్ట్రంలో జూన్​ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్​కు పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్​ను పోలీసు అధికారులు అమలు చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు.

పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు డ్రోన్ కెమెరాలతో ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో అల్లర్లు, రాళ్ల దాడులు జరిగిన సంఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ ప్రజలు గుమిగుడి ఉండకూడదని సూచించారు. ఎన్నికల కౌంటింగ్​ రోజున అల్లర్లు, దాడులు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చారించారు.

ABOUT THE AUTHOR

...view details