తెలంగాణ

telangana

మినిస్టర్​ పొన్నం ఫొటోగ్రాఫర్​పై దాడి - పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం - Minister Ponnam fire on police

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 9:38 PM IST

Minister Ponnam Fire on Police (ETV Bharat)

Minister Ponnam Fire on Police : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోగ్రాఫర్​పై దాడి జరిగింది. రథోత్సవం కార్యక్రమాన్ని ముగించుకొని మంత్రి వెళ్తున్న సమయంలో కాన్వాయ్ ముందు ఫోటోలు చిత్రీకరిస్తున్న కెమెరామెన్​పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కెమెరామెన్​ అయినా, మీడియా ఫోటోగ్రాఫర్ అయినా సరే ఎవరి పైనా చేయి ఎత్తడం మంచిది కాదని మంత్రి పొన్నం హితవు పలికారు. దాడికి పాల్పడటం కరెక్ట్​ కాదని ఫైర్​ అయ్యారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అక్కడకు చేరుకొని, మంత్రికి సర్ది చెప్పడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. 

ఇవాళ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గుమ్మడి కాయ కొట్టి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, సనత్ నగర్ ఇంఛార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో పోతురాజుల ఆటపాటలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details