ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కేసులు సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం: ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్​పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా - జాతీయ మానవ హక్కుల కమిషన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 7:59 PM IST

NHRC chairperson arun Mishra Meeting in Vijayawada :  జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వచ్చే కేసులను సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్​పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు. విజయవాడ పోలీస్ కమాండ్ సెంటర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్​పర్సన్ జస్టిస్ మిశ్రా సభ్యులతో కలిసి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో లక్షకు పైగా కేసులు ఎన్​హెచ్​ఆర్​సీకి వస్తున్నాయని తెలిపారు. 

NHRC Participated in meeting at Vijayawada : నిర్ణీత కాలవ్యవధిలో ఈ కేసులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎన్​హెచ్​ఆర్​సీ వద్ద 6 వేల పెండింగ్​ కేసులు మాత్రమే ఉన్నాయని జస్టిస్ మిశ్రా చెప్పారు. పెండింగ్ (Pending) కేసుల్లో సకాలంలో ఏటీఆర్ లు సమర్పించాలని వివిధ శాఖలకు కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని జస్టిస్ మిశ్రా చెప్పారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే మానవ హక్కుల కమిషన్ లక్ష్యమని జస్టిస్ మిశ్రా అన్నారు. పెండింగ్ కేసుల (Case) సత్వర పరిష్కారానికి ఎన్​హెచ్​ఆర్​సీ (NHRC) ప్రణాళికాయుతంగా కృషి చేస్తుందని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details