ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సస్పెండైన దేవదాయశాఖ ఉద్యోగి శాంతి అక్రమాలపై విచారణ కొనసాగుతోంది : మంత్రి ఆనం - Minister Anam comments on Shanti

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 10:49 PM IST

Minister Anam Ramanarayana Reddy Comments on Shanti (ETV Bharat)

Minister Anam Ramanarayana Reddy Comments on Shanti : దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్​గా పనిచేస్తూ సస్పెండైన శాంతిపై విచారణ కొనసాగుతోందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివేదించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో నివేదికలను తొక్కి పెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమె ద్వారా నష్టపోయిన వారు తమ వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. ఆమె సస్పెన్షన్​పై వివరణ ఇవ్వమని నోటీసులు ఇచ్చిన ఇంతవరకు సమాధానం లేదన్నారు. 

వైసీపీ హయాంలో విశాఖపట్నం జిల్లాలో జరిగిన భూదందాల్లో దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె. శాంతి సహా గతంలో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన సుభాష్‌రెడ్డి హస్తం ఉన్నట్లు గుర్తించామని మంత్రి ఆనం తెలిపారు. శాంతిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆమె సస్పెన్షన్‌లో ఉన్నట్లు వివరించారు. గత మూడేళ్లుగా విశాఖపట్నంలో అనేక దేవాదాయ భూములను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అక్రమంగా కట్టబెట్టినట్లు గుర్తించామన్నారు. సుభాష్‌రెడ్డితో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిందని వెల్లడించారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details