ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : మన్మోహన్‌ సింగ్​కు కన్నీటి వీడ్కోలు - ప్రత్యక్షప్రసారం - MANMOHAN SINGH LAST RITES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2024, 9:31 AM IST

Updated : Dec 28, 2024, 1:21 PM IST

Manmohan Singh Last Rites : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అంత్యక్రియల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. దిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్డులో మన్మోహన్‌ సింగ్‌ నివాసంలోనే ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం ఇవాళ ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలుకానుంది. సంస్కరణలతో దేశార్థికాన్ని నవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ భారతావని శుక్రవారం కన్నీటి నివాళులర్పించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులు ఆయన పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశానికి మన్మోహన్‌ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. 
Last Updated : Dec 28, 2024, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details