బ్రేకులు ఫెయిలై లోయలోకి దూసుకెళ్లిన లారీ - ముగ్గురు మృతి - lorry accident paderu - LORRY ACCIDENT PADERU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 10:49 AM IST
Lorry Boltha in Alluri Sitaramaraju District : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో లారీ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెదబయలులో జాతర ముగించుకుని సౌండ్ బాక్స్లతో వెళ్తున్న లారీ, బ్రేకులు విఫలమై బోల్తా పడింది. లారీపైన కూర్చున్న వారు పక్కనే లోయలో పడిపోగా వారిపై సౌండ్ బాక్సులు, ఇనుప సామాగ్రి పడ్డాయి. ఇద్దరు ఘటనా స్థలిలోనే చనిపోగా ఒకరు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అచ్యుతాపురం పరిసర ప్రాంతాలకు చెందిన లక్ష్మణ్(25), హరి (30), అశోక్ (30)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరో 12 మందికి గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. గాయపడిన వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తదితరులు పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.