ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: లోక్​సభలో కొనసాగుతున్న ఎంపీల ప్రమాణ స్వీకారం - ప్రత్యక్షప్రసారం - Lok Sabha Sessions 2024 Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 2:26 PM IST

Updated : Jun 25, 2024, 6:07 PM IST

Lok Sabha Sessions 2024 Live : 18 లోక్​సభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎంపీలుగా ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొదటి రోజైన సోమవారం నాడు 262 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గ్లం, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. మిగతా వారితో ప్రొటెం స్పీకర్ నేడు ప్రమాణం చేయిస్తున్నారు. ఇవాళ్టితో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఇక 26వ తేదీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం దానిపై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈసారి ప్రతిపక్ష నాయకులు నంబర్ సైతం బాగానే ఉంది. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యులు, విపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలున్నారు.
Last Updated : Jun 25, 2024, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details