ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కోసం బారులు తీరిన లబ్ధిదారులు - సర్వర్​ డౌన్​తో ఇబ్బందులు - జగనన్న కాలనీల స్థలాల రిజిస్ట్రేషన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 5:09 PM IST

Jagananna Colony Sites Registrations: జగనన్న కాలనీల స్థలాల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్, మున్సిపల్, సచివాలయాల కార్యాలయాల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు వందలాది మంది లబ్ధిదారులు చేరుకోవటంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వాదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజు అధికారులు రిజిస్టేషన్ల ప్రక్రియ చేస్తున్నారు. 

వందలాదిమంది ఒక్కసారిగా రిజిస్టర్ ఆఫీస్​లకు చేరుకోవడంతో కార్యాలయాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని లబ్ధిదారులను లైన్లో పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించారు. సర్వర్ స్లో అవటంతో రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. సచివాలయాలలో సిబ్బందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవగాహన లేకపోవటంతో ఎక్కువ సమయం పడుతుందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

"వందలాదిమంది ఒక్కసారిగా రిజిస్టర్ ఆఫీస్​లకు చేరుకోవడంతో కార్యాలయాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సర్వర్ స్లో అవటంతో రిజిస్ట్రేషన్ కోసం గంటలతరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవగాహన లేకపోవటంతో ఎక్కువ సమయం పడుతోంది." -  లబ్ధిదారులు

ABOUT THE AUTHOR

...view details