ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రిపోర్టర్ హత్య కేసులో వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్‌ - నవంబర్‌ 5న ఉత్తర్వులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 1:04 PM IST

High Court on YSRCP Leader Dadisetti Rajas Anticipatory Bail Petition : ఆంధ్రజ్యోతి పత్రిక రిపోర్టర్‌ కాతా సత్యనారాయణ హత్య కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. నవంబర్‌ 5న ఉత్తర్వులు వెలువరిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్​కే కృపాసాగర్‌ తెలిపారు. తుని, తొండంగిలో పాత్రికేయునిగా పని చేస్తున్న కాతా సత్యనారాయణ బైక్‌పై వెళ్తుండగా పలువురు కత్తులతో దాడి చేసి హత మార్చారు. 

దీనిపై అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత దాడిశెట్టి రాజా పేరును తొలగించి విచారణ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం దాడిశెట్టి రాజా హైకోర్టులో వేసిన పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్‌ పేరున్నప్పటికి తర్వాత దాఖలు చేసిన ఛార్జిషీట్​లో లేదన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రాజాను కేసులో ఇరికించేందుకు యత్నిస్తున్నారన్నారు. అనంతరం మృతుడి సోదరుడు కాతా గోపాలకృష్ణ తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details