ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పు తీర్చే సమయంలో అసలు బంగారం నకిలీ ఎలా అయ్యింది! - Gold Dealer CHEATING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 10:38 PM IST

Gold Dealer Cheated in Women (ETV Bharat)

Gold Dealer Cheated in Women Complaints in Nellore : బంగారం కుదువ వ్యాపారి మోసం చేస్తున్నాడని పశ్చిమగోదావరి జిల్లా నరసారపురానికి చెందిన మహిళ నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ అవసరాల కోసం 3 సంవత్సరాల కిందట విడతల వారీగా తాను కిలో బంగారం తాకట్టు పెట్టి రూ. 47 లక్షలు అప్పు తీసుకున్నానని ఆమె తెలిపారు. వాటికి సంబంధించిన వడ్డీని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నానని మహిళ చెప్పారు. 

తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వమంటే తనపైన తప్పుడు కేసులు పెట్టారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని మహిళ వాపోయింది. తన వద్ద వడ్డీ చెల్లించిన 23 రసీదులు ఉన్నాయని న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆమె అన్నారు. నకిలీ బంగారం తాకట్టు పెట్టానని పోలీసు స్టేషన్‌లో తనపై ఫిర్యాదు చేశారని మహిళ వాపోయారు. నకిలీ బంగారం అయితే 3 సంవత్సరాల క్రితం కుదువ వ్యాపారి ఎలా తాకట్టు పెట్టుకున్నారని ఆమె ప్రశ్నించింది. నెల్లూరులో న్యాయవాద వృత్తి అభ్యసిస్తున్నందువల్ల ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details