ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విడదల రజిని రూ.2.20 కోట్లు దోచేశారు - టీడీపీ కార్యాలయంలో బాధిత వ్యాపారుల ఆవేదన - vidadala rajini victims

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 7:21 AM IST

Former_Minister_Vidadala_Rajini_Victims_at_TDP_Central_Office (ETV Bharat)

Former Minister Vidadala Rajini Victims at TDP Central Office: తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులు వినతి పత్రాలతో పోటెత్తారు. మాజీమంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ తమను భయభ్రాంతులకు గురి చేసి రూ. 2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారని పల్నాడు జిల్లాకు చెందిన వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ  టీడీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌కు చెందిన నంబూరి శ్రీనివాసరావు, కట్టా శ్రీనివాసరావు, రావిపాటి వేణుగోపాలకృష్ట ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్సీపీ భూ కబ్జాల బాధితులు, గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల బాధితులు, కొత్త పింఛన్లు మంజూరు కోసం జనం పెద్ద ఎత్తున బాధితులు తరలి వస్తున్నారు. వారి నుంచి మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి, వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details