ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోజుకో ముసుగులో సైబర్ వల - లింక్స్​పై క్లిక్ చేశారో అంతే ! - APK File Phone Hacking Cyber Fraud

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 8:24 PM IST

APK_File_Phone_Hacking_Cyber_Fraud (ETV Bharat)

APK File Phone Hacking Cyber Fraud: సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి నగదును దోచుకునేందుకు ఎప్పటికప్పుడు వారి పంథాను మార్చుకుంటున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును సరికొత్త మోసాలతో చిటికెలో కొట్టేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేసే ప్రయత్నం చేశారు. లింక్​లు పంపించి క్లిక్​ చేస్తే చాలు సభ్యులుగా ఉండొచ్చు అని ఏపీకే ఫైల్స్ ముసుగులో మెసెజెస్ చేశారు. అది నిజమేనని నమ్మిన ఇద్దరు కానిస్టేబుల్స్ క్లిక్ చేయటంతో వెంటనే వారి ఫోన్స్ హ్యాక్ అయిపోయాయి. 

విషయం తెలుసుకున్న సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, APK ఫైల్స్ అంటూ లింక్స్ వస్తే ఎవ్వరూ క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో కంబోడియా కేంద్రంగా ఏపీకే ఫైల్స్ ముసుగులో జరుగుతున్న సైబర్ దోపిడీపై విజయవాడ సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details