ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వర్షానికి మట్టిమిద్దె కూలి దంపతులు మృతి- అనంతపురం జిల్లాలో విషాదం - Couple Died

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 10:32 AM IST

couple_died (ETV Bharat)

Couple Died After House Collapse in Anantapur District : రోజులాగే భోజనం చేసి పడుకున్న ఆ కుటుంబ సభ్యులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. వరుస వర్షాలకు తడిసి ముద్దయిన ఆ మట్టి మిద్దె కూలిపోయింది. ఈ సంఘటనలో దంపతులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కుమార్తె, అల్లుడు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. విడపనకల్లు మండలం హావళిగి గ్రామంలో ఇంటి పైకప్పు కూలి కోనప్ప గారి మారెప్ప (45), అతడి భార్య లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో వారి కుమారై మానస, అల్లుడు అంజికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు అప్రమత్తమై మట్టిని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన తమ కుమార్తె, అల్లుడిని రక్షించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం (జులై 13) కురిసిన వర్షం ధాటికి మట్టిమిద్దె కూలిందని గ్రామస్థులు తెలిపారు. ఒకేసారి దంపతుల మృతి చెందడంతో హావళిగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details