ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 1:42 PM IST

Updated : Aug 22, 2024, 4:57 PM IST

ETV Bharat / videos

LIVE: అచ్యుతాపురం ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - Chandrababu Tour in Atchutapuram

Chandrababu visits Atchutapuram SEZ : అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులు ధైర్యంగా ఉండాలని ఎంత ఖర్చయినా సరే భరిస్తామని, ఎలాగోలా కాపాడుకుంటాని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో సీఎం పరామర్శించారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.  అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు....బాధితులందరినీ వ్యక్తిగతంగా పలకరించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు ప్రమాదం జరిగిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. మేము అన్నీ చూసుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు. ఆస్పత్రి ఆవరణలో బాధితులు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. తీవ్ర గాయాలైనవారికి 50 లక్షల రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అచ్యుతాపురం సెజ్​లో ప్రమాదస్థలిని పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం. 
Last Updated : Aug 22, 2024, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details