ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 5:31 PM IST

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ నాయకులు మోసం చేశారు - కడపలో బాధితుల ఆందోళన - Buddha Township Victims Complaint

Buddha Township Victims Complaint on YSRCP Leaders : వైఎస్సార్సీపీ నాయకులు కడప శివారులో నిర్మించిన బుద్ధ టౌన్​షిప్​లో తమకు చాలా అన్యాయం చేశారంటూ బాధితులు వాపోయారు. నిర్మాణ సమయంలో పలు వసతులు కల్పిస్తామని చెప్పి నిర్మాణాలు నిర్మించిన తరువాత నిర్వాహకులు మొండి చేయి చూపారని ఆరోపించారు. అధికారంలో ఉన్నామని బిల్డర్స్ తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధ టౌన్​షిప్​ నిర్వహణ మొత్తం వైఎస్సార్సీపీ నాయకులు గుమ్మా రాజేంద్రనాథ్​రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారని, దీని వెనకాల మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి తోపాటు పలువురు బడా నాయకుల హస్తం ఉందని తెలిపారు. 

బుద్ధ టౌన్​షిప్​లో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నిర్వాహకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2018 నుంచి బుద్ధ టౌన్​షిప్​లో గృహాలు నిర్మించుకున్నామని చెప్పారు. ఎక్కువ మంది విశ్రాంతి పొందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, హోమ్ థియేటర్, మినీ ఫంక్షన్ హాల్, సీసీ కెమెరాలు, దేవాలయాలు తదితర వాటిని నిర్మిస్తామని చెప్పి నిర్వాహకులు మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై నిర్వాహకులను నిలదీస్తే తమపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం  తమ సమస్యలను పట్టించుకోలేదని, కొత్త ప్రభుత్వంలోనైనా పరిష్కరించాలని బాధితులు కోరారు. 

ABOUT THE AUTHOR

...view details