ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 12:55 PM IST

Updated : Sep 12, 2024, 1:06 PM IST

ETV Bharat / videos

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం - ఏడుగురికి గాయాలు - Sandhya Rani escort vehicle acciden

Minister Sandhya Rani Escort Vehicle Accident : విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. మంత్రి సంధ్యారాణి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా భూసాయివలస-అరికతోట మధ్య ఎస్కార్ట్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న బొలెరో ఢీకొంది. ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలోని నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే బొలెరో వాహనం డ్రైవర్ త్రినాథ్‌, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన నలుగురు భద్రతా సిబ్బందిని మంత్రి సంధ్యారాణి స్వయంగా అంబులెన్స్ ద్వారా విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి తెలిపారు.

అయితే ఎస్కార్టు వాహనం వెనుకనే మంత్రి సంధ్యారాణ ప్రయాణిస్తున్న వాహనం ఉంది. ముందున్న ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురికావడంతో వెంటనే మంత్రి ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని పక్కకు మళ్లించారు. దీంతో మంత్రికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు జాతీయ రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది.

Last Updated : Sep 12, 2024, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details