ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విషజ్వరాలా? ఆహార కల్తీనా?- 40 మంది మదర్సా విద్యార్థులకు అస్వస్థత - MADRASA STUDENTS SICK

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 5:32 PM IST

విషజ్వరాలా? ఆహార కల్తీనా?- 40 మంది మదర్సా విద్యార్థులకు అస్వస్థత (ETV Bharat)

40 students fall sick at madrasa: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని జామియా మహమ్మదీయ కళాశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులు మలేరియా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దోమలు కుట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్య అధికారులు కళాశాలలో తనిఖీలు చేపట్టారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కళాశాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయమై వైద్యురాలు ప్రతిభను సంప్రదించగా ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉన్నందున నీరు, ఆహారము కల్తీ జరిగినట్లు ఆధారాలు లేవని, 40 మందిలో 20 మందిని ఇళ్లకు పంపినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 450 మంది విద్యార్థులు ఖురాన్ పఠించేందుకు మదరసాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీ రాత్రి భోజనం చేసిన విద్యార్థులకు ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు, జ్వరాలు రావడం గుర్తించిన కళాశాల సిబ్బంది... స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. వీరిలో కొంతమందికి ప్రాథమిక చికిత్స అందించి ఇళ్లకు పంపించారు. దాదాపు 20 మంది ఆసుపత్రిలో చికిత్సలు పొందారు.  రెండు రోజులు కళాశాలకు సెలవులు రావడంతో వర్షంలో తడిసి జ్వరాలు వచ్చాయని కళాశాల కార్యదర్శి హమీర్ అంజా అహ్మద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details